జనసేన నాయకులను కలిసిన చౌడడా సునీల్ మరియు దీప్తి మహంతి సుబ్బారావు

జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ మండల కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చౌడడా సునీల్. జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ మండల కమిటీ కార్యదర్శిగా నియమితులైన దీప్తి మహంతి సుబ్బారావు. సోమవారం జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. తరువాత జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో శాటిలైట్ సిటీ జనసైనికులు గోడిసిపూడి నాగేంద్ర, ఎలుగుబంటి దుర్గారావు, పోలురి శ్రీను, పాలవలస గోపి, సేశెట్టి ప్రసాద్ బాబు, పీతల సూరిబాబు, శీలం సురేష్ తదితరులు పాల్గొన్నారు.