సమాచార హక్కు చట్టం సహాయంతో గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ: కణితి కిరణ్

సంతబొమ్మాళి మండలం, గోవిందపురం గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయంలొ ప్రభుత్వ పథకాలు జాబితాలు, ఇంటిపన్ను వసూళ్లు రికార్డులు గ్రామ పంచాయతీ గ్రాంట్ రికార్డులు, పంచాయితీ సంబందించి పలు రికార్డులు సమాచార హక్కు చట్టం సహాయంతో తనిఖీ చేయడం జరిగింది. పాలనలో పారదర్శకతతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవినీతికి త్రోవలేకుండా, ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విదంగా మరియు గ్రామంలో జరిగే పనులకి సంబందించి నాణ్యత లోపాలు తెలుసుకొనుటకు సమాచార హక్కు చట్టాన్ని ప్రతి పౌరుడు ఉపయోగించుకోవాలి అంటూ జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ తెలిపారు. అలాగే గోవిందపురం గ్రామపంచాయతీ లొ రికార్డుల పరిశీలన లో 2018-2019 సంవత్సరాలకు గాను ఎటువంటి ఇంటిపన్ను రసీదు పుస్తకాలు, ఛలానాలు లేవని, పంచాయతీకి స్టాక్ రిజిస్టర్ లేదని, పంచాయతీకి జి.ఎస్.టి నెంబర్ లేదని తమ దృష్టికి వచ్చిందని మరిన్ని వివరాలు కావాలని తెలుపగా సెక్రటరీ వారం రోజులలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సహకరించిన పంచాయతీ సెక్రటరీ ఢిల్లీశ్వరరావుకు మరియు అతని సిబ్బందికి టెక్కలి జనసేన పార్టీ తరుపున కణితి కిరణ్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ రికార్డుల తనిఖీ కార్యక్రమంలో గోవిందపురం జనసేన నాయకులు చిన్నా రెడ్డి, చిరంజీవి రెడ్డి, రాంప్రసాద్, హరి పాల్గొన్నారు.