మృతురాలి కుటుంబానికి జనసేన నాయకులు ఆర్థిక సహాయం

రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామంలో డెంగ్యూ జర్వం కారణంగా ఇటీవల మృతి చెందిన సబ్బిత మధు కుటుంబాన్ని రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి జనసేన పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని చెప్పి జనసైనికుల చేతుల మీదుగా ఆ బాధిత కుటుంబానికి రూపాయలు 10,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు కడియం భార్గవ్, నాయకులు కట్ట వెంకన్న బాబు, కట్ట పోలీస్, ఈ.డి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.