చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు జనం కోసం జనసేన

  • త్రాగునీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై ద్వజమెత్తిన మనుక్రాంత్ రెడ్డి
  • గడపగడపకు వెళ్తుంటే ప్రజలే ముందువస్తూ తమ సమస్యలను వివరిస్తున్నారు
  • శనివారం నిర్విరామంగా కొనసాగిన గడపగడపకు జనం కోసం జనసేన

నెల్లూరు: త్రాగునీరు కూడా అందించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఎద్దేవా చేసారు. డ్రైనేజీ పూడికలు తీయక పోవడంతో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ 3వ డివిజన్‌లో చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నేతలు కార్యకర్తలతో కలిసి గడపగడపకు జనం కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. గడపగడపకు వెళ్తూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చెన్నారెడ్డి మనుక్రాంత్ గడపగడపకు వెళ్తుంటే ప్రజలే ముందుకు వచ్చి తమ సమస్యలను ఆయనకు వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలు, డైనేజీ త్రాగునీటి సమస్యలను చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డికి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్రాగునీరు, డైనేజీ సమస్యలతో నగర వాసులు సతమతమవుతున్నారని తెలిపారు. గడపగడపకు వెళ్తుంటే ప్రజలు మందుకు వచ్చి తమ సమస్యలను వివరిస్తున్నారని తెలిపారు. ప్రజలు నమ్మి అనిల్ కూమార్ యాదవ్‌ను గెలిపిస్తే మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే అందరి భవిష్యత్ బాగుంటుందని వివరించారు.