బండ్రెడ్డి రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరిన చెరుకుపల్లి కిషోర్

నూజివీడు మండలం పాత రావిచర్లకి చెందిన పురోహితుడు చెరుకుపల్లి కిషోర్ తన మిత్రులతో కలసి విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. కిషోర్ కి రామకృష్ణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం అభినందనీయమని పాత రావిచర్ల గ్రామంలో, నూజివీడులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి నుంచి టీచర్స్ యూనియన్ నాయకులు మరియు టీచర్స్ కొందరు జిల్లా అధ్యక్షులని కలిసి సిపిఎస్ రద్దు చేస్తామని ఆవిర్భావసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడటంపై హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నూజివీడు నియోజకవర్గ నాయకులు తుమ్మల జగన్, సురేష్, పాత రావిచర్ల గ్రామ నాయకులు పగడాల దుర్గారావు తోట బలరాం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.