పులి మల్లికార్జున రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన చిలకపాటి సుశీల

కందుకూరు: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షతన కందుకూరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులి మల్లికార్జున రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన మహిళ నాయకురాలు చిలకపాటి సుశీల జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయన నీతీ నిజాయితీ సమాజం పట్ల సాయం చేసే గుణం ఆదర్శ భావాలు అన్ని నచ్చి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకొని శనివారం పులి మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షతన హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీసులో శనివారం జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ మీలాంటి వీర మహిళలు జనసేన పార్టీకి అండగా ఉండి పవన్ కళ్యాణ్ కి మీ దీవెనలు అందించి ముఖ్యమంత్రి స్థానంలో నిలపాలని రాజకీయంగా నీతి నిజాయితీలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను స్థానిక ఇంచార్జ్ మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ మెంబర్లు మండలాధ్యక్షులతో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేయాలని ప్రభు సూచనలు తెలియజేశారు. అదేవిధంగా పులి మల్లికార్జున రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో రాజకీయ కుల అహంకారాలకు భయపడకుండా జనసేన పార్టీలో ఒక వీర మహిళ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని నియోజకవర్గంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పే విధంగా జనసేన పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తుందని త్వరలోనే ఒక ఉప్పెనలా నియోజకవర్గంలో పార్టీ ఎంత బలమైన స్థితిలో ఉందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నేను అన్ని విధాలుగా పార్టీని బలోపేతం చేస్తానని మరోసారి చిలకపాటి సుశీల కు మా జిల్లా నాయకులు తరఫున మండల అధ్యక్షులు తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.