శీలం శ్రీకాంత్ కు నివాళులు అర్పించిన జనసేన

మంగళగిరి: తాడేపల్లి మండలం, కొలనుకొండ గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు శీలం శ్రీకాంత్ గుండెపోటుతో మరణించడం జరిగింది. మంగళవారం కొలనుకొండ గ్రామంలోని శ్రీకాంత్ ఇంటి వద్ద జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, కొలనుకొండ గ్రామ జనసైనికులు తదితరులు శ్రీకాంత్ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చిల్లపల్లి శ్రీనివాసరావు శ్రీకాంత్ అకాల మరణానికి చింతిస్తూ జనసేన పార్టీ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.