అంబేద్కర్ కు నివాళులర్పించిన చిర్రి బాలరాజు

పోలవరం, టి.నరసాపురం మండలం, బొర్రంపాలెం, వెంకటాపురం గ్రామాలలో మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ భీంరావు అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు పూలమాల వేసి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిర్రి బాలరాజు మాట్లాడుతూ బడుగు బలహీన అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందాలానే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, అంబేద్కర్ ఏ ఆశయాలు కోసం అయితే తాను కష్టపడ్డారో వాటిని మరచిపోకూడదని, అవి ఆచరణ లోకి వచ్చేలా మన ప్రయత్నం చెయ్యాలని, ఆయన జీవితం ఎందరికో ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామస్థులు యువకులు భారీగా బైక్ ర్యాలీ చేసి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అడపా నాగరాజు, జెట్ల సత్యనారాయణ, రాంబాబు, షేక్ హిమాం, తోట సత్యనారాయణ, పెద్దింటి చంటి, షేక్ సుభాని, పసుపులేటి సాయి, కోటేండ్ల మురళి మరియు జనసైనికులు గ్రామస్థులు పాల్గొన్నారు.