అంబేద్కర్ కు నివాళులర్పించిన గునుకుల కిషోర్

నెల్లూరు సిటీ, బాబాసాహెబ్ డా. బి. అర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు సిటీ నందు గల ఆయన విగ్రహానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పూలమాల వేసి అంజలి ఘటించారు. అంటరాని తనం, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ఎనలేని కృషి చేసి తాను ఎదుర్కున్న వివక్ష తరువాత తరాల వారు చూడరాదని కష్టపడి ఉన్నత శిఖరాలను చేరుకుని భారత దేశ దిశా నిర్దేశనం చేసే భారత రాజ్యాంగాన్ని అందించే స్థాయికి ఎదిగిన మేధావి, సంఘ సంస్కర్త, సమతా వాది డా.బి.అర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి అంజలి ఘటిస్తూ నీ కోసం జీవిస్తే నీలోనే నిలుస్తావు. ప్రజల కోసం జీవిస్తే జనాలలో జీవిస్తావు. అని వారు తెలిపిన విధంగా ప్రయాణిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని గెలిపించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున కిషోర్ తో సుధాకర్, పూసల మల్లేశ్వర రావు,మౌనేష్, చిన్న రాజా,ప్రశాంత్ గౌడ్, హేమ చంద్ర యాదవ్, వెంకీ, ప్రసన్న, వర్షన్, బాలాజీ, ఖలీల్, నారాయణ, షాజహాన్, వర, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.