ఏపూరి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్రి బాలరాజు

పోలవరం: వేలేరుపాడు మండల పట్టణంలో కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన క్రియాశీలక సభ్యులు మరియు జనసేన పార్టీ కార్యకర్త ఏపూరి రాజేష్ కుటుంబాన్ని శనివారం పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరో తీర్చలేనిదని క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందువలన ఇచ్చిన మాట ప్రకారం రావలసినటువంటి 5 లక్షల నగుదును అందించి అండగా నిలబడతామని, జనసేన పార్టీ నమ్ముకున్న వారిని ఎప్పటికీ వదలదని మీకేమైనా కష్టం వస్తే అండగా జనసేన పార్టీ జనసేన నాయకులు ముందుగా ఉంటారని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ, మెచ్చినేని సంజయ్, దేవి రెడ్డి సుధాకర్, చిచ్చుడీ ప్రసాద్ జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు ప్రగాఢసానుభూతి తెలిపారు.