క్రిస్మస్ వేడుకలు|102 ప్రార్థనా మందిరాలలో 12 వేల ఫ్లమ్ కేకుల పంపిణీ

  • క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లమ్ కేకులు అందించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండల పరిదిలోని అన్ని గ్రామాల్లో కరప మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, అనుకూల రాంబాబు, సుందర సత్తిబాబు, యర్రంశెట్టి దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ అధ్యక్షుల సమక్షంలో కరప మండల పరిదిలోని సుమారుగా 102 ప్రార్థన మందిరాలలో జనసేన పిఎసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఏర్పాటు చేసిన 12 వేల ఫ్లమ్ కేకులను చర్చిలలో క్రైస్తవులందరికీ జనసేన నాయకులు, జనసేన శ్రేణులు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా చర్చి ఫాదర్స్ మరియు క్రైస్తవ సోదర సోదరీ మణులు పంతం నానాజీకి ధన్యవాదములు తెలిపారు. చర్చి ఫాదర్ క్రిస్మస్ పర్వదినమున ప్రత్యేక ప్రార్థనలు గావించి, 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయటానికి ప్రతి క్రైస్తవులు కోరుకుంటున్నారని, కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్నిగ్రామాల, డివిజన్ల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.