జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్ ప్రశాసన్ నగర్లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ హాజరయ్యి యేసుక్రీస్తు గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజవర్గాలకు చెందిన కో ఆర్డినేటర్లు, నాయకులు, వీరమహిళలు పొన్నూరు శిరీష, మిరియాల రామకృష్ణ, నందగిరి సతీష్, సైదా శ్రీనివాస్, రత్న పిల్లా, నిహారిక, లిఖిత, రాజేష్, బండి నరేష్, నాగేంద్ర, సాయి కిరణ్ రెడ్డి,దళిత రాజు, కార్తిక్, సాయికృష్ణ, లక్ష్మీ సకలాబత్తుల, వెంకటలక్ష్మీ జనసేన పార్టీ నాయకులు, జనసేన వీర మహిళలు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.