మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ ఇంటి నుంచి క్రిస్మస్ కానుక..

చాలా రోజుల తరువాత మళ్ళీ పవన్, మహేష్ అభిమానులు సంతోషపడేలా ఒక అద్భుతమైన పోస్ట్ వైరల్ అవుతోంది. అందుకు సంబందించిన నమ్రత పోస్ట్ సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి ఒక ప్రత్యేకమైన కానుక వెళ్లింది. ఆ విషయాన్నీ మహేష్ సతీమణి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎవరు పంపారంటే.. పవన్ భార్య అన్నా అన్నా లెజ్‌నేవా. క్రిస్మస్ కానుకగా చాక్లెట్లు నిండిన ఒక స్పెషల్ బాక్స్ అలాగే ప్రత్యేకమైన గ్రీటింగ్ ఉంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు నమ్రత.

స్పెషల్ గ్రీటింగ్ లో మీ గురించి హృదయపూర్వకంగా ఆలోచిస్తూ, ఈ పవిత్రమైన సీజన్ లో సున్నితమైన అద్భుతాల ద్వారా మీరు బావుండాలని, ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నట్లు కోరుకుంటూన్నాను.. అన్నా, కళ్యాణ్. ” అని అందులో స్పెషల్ గా రాసి ఉంది. ఇక స్పెషల్ కానుకకు నమ్రత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కేవలం మహేష్ బాబు ఫ్యామిలీకి అనే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులకు అన్నా తన క్రిస్మస్ కానుకలను పంపుతున్నారు. హీరో దగ్గుబాటి రానాకు కూడా ఆమె ప్రత్యేకంగా గ్రీటింగ్స్ తో పాటు గిఫ్ట్ ను కూడా పంపారు. అందుకు రానా ట్విట్టర్ ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.