విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నసిఎం జగన్‌

విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బుధవారం పాల్గొని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సిఎం దర్శించుకున్నారు. పీఠం ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రాజశ్యామల యాగంలో సిఎం జగన్‌ పాల్గొన్నారు. రాజశ్యామల యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సిఎం జగన్‌ కు తెలిపారు. పీఠంలో సుమారు గంటసేపు సిఎం గడిపారు. ఈ కార్యక్రమంలో పీఠం లోనే అమ్మవారి ప్రసాదాన్ని సిఎం స్వీకరించారు. పీఠంలో నిర్వహించే కార్యక్రమాల గురించి సిఎం జగన్‌ కు శారదా పీఠాధిపతి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎం విశాఖ శ్రీ శారదాపీఠం వెబ్‌ సైట్‌ ను జగన్‌ ఆవిష్కరించారు. పండితులకు సిఎం జగన్‌ చేతులమీదుగా సత్కారం జరిగింది. ఈ వార్షికోత్సవంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.