యూపీ అథ్లెట్లకు సీఎం యోగీ బంపర్‌ ఆఫర్‌.. గోల్డ్ గెలిస్తే ఆరు కోట్లు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఒలింపిక్ అథ్లెట్లకు నజరానా ప్రకటించారు. గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు తమ రాష్ట్రం ఆరు కోట్ల నగదు ఇస్తుందన్నారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం యోగి వెల్లడించారు. ఈనెల 23వ తేదీ నుంచి టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన భారత క్రీడాకారుల్లో .. పది మంది ఆటగాళ్లు యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. షూటర్ సౌరభ్ చౌదరీ యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగిల్స్‌, టీమ్ ఈవెంట్లలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారిడికి 10 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం యోగి వెల్లడించారు. అంతకముందు ఆయన వారణాసిలో కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేశారు.