ఏపీ పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు.. సెప్టెంబరు మొదటి వారంలో పరీక్షలు!

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్‌ను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించినా తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయినట్టు ప్రకటించిన ప్రభుత్వం త్వరలోనే ఫలితాలను ప్రకటించనుంది. అనంతరం పాలిసెట్‌పై ప్రకటన చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పాలిటెక్నిక్‌కు బోధన రుసుముల చెల్లింపు సదుపాయం ఉండడంతో దరఖాస్తులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.