జనసేనాని జన్మదినం – భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో సహ పంక్తి భోజనం చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన ఘనంగా జరుపుకోవడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం సంతోష దాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, మదనపల్లి రూరల మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకులు జగదీష్, లక్ష్మినారాయణ, తోట కళ్యాణ్, నగేష్, మోహన కృష్ణ, అర్జున కుమార్, నవాజ్, పద్మావతి, జంగాల గౌతమ్, జై, పవన్, నాగవేణి, శంకర, గండి కోట లోకేష్ తదితరులు పాల్గొన్నారు.