జనసేన ఆత్మీయ సమావేశం

సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం వేత్తలతడుకు పంచాయతీలో మండల అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో ఆదివారం జనసైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ హాజరయ్యారు. పార్టీ బలోపేతం కోసం జనసైనికులతో చర్చించడం జరిగింది. గ్రామంలో త్రాగునీరు కాలుష్యం వలన కిడ్నీ సమస్యలు వస్తున్నాయని నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. అధికారుల్ని కలసి ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు హేమసుందరం, మండల కమిటీ సభ్యులు సతీష్, శేషేంద్ర, గురవయ్య, రాజు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.