శ్రీరెడ్డి పై సీపీ సజ్జనార్ కు జనసేన వీర మహిళా విభాగం ఫిర్యాదు

హైదరాబాద్: జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న సినీ నటి శ్రీరెడ్డి పై సైబరాబాద్ కమిషనరేట్ లో కంప్లైంట్ చేశారు. తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం తరపున కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ తెలంగాణ వీరమహిళా విభాగం చైర్మన్ కావ్య మండపాక ఈమేరకు సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు.