విద్యార్థి సాగర అప్పలరాజు కుటుంబానికి పరామర్శ

అరకు నియోజకవర్గం పరిధిలో గల బొండం పంచాయతీ, రంపుడువలస గ్రామానికి చెందిన విద్యార్థి సాగర అప్పలరాజు ప్రమాదవసాత్తూ గాయపడడం జరిగింది. విషయం తెలిసిన జనసేన మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, గత్తున్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల పర్యటనలో బాగంగా.. గాయపడిన విద్యార్థి కుటుంబీకులను పరామర్శించారు. ప్రస్తుతం గాయపడిన అప్పలరాజును వైద్యం కోసం విజయనగరం హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నట్లు అప్పలరాజు కుటుంబీకులు తెలియజేసారు.