క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్స్ కు అభినందన సత్కారం
గురజాల నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మూడో విడత జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజవర్గ క్రియాశీలక వాలంటీర్స్ గా పనిచేసిన జనసైనికులకు పిడుగురాళ్ల మండల పార్టీ ఆఫీసు నందు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజవర్గంలో అత్యధికంగా సభ్యత నమోదు కార్యక్రమం జరగడం చాలా శుభ పరిణామం అని, కార్యకర్తల క్షేమం కోసం.. పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని నిస్వార్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎంతో కృషిచేసి సభ్యత్వ నమోదు చేయించిన క్రియా వాలంటీర్లకు పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నాయకులు నారదాసు రామచంద్ర ప్రసాద్, బడిదల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, దాచేపల్లి మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు, మాచవరం మండల అధ్యక్షుడు బొమ్మ శ్రీనివాసరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు పెడకొలిమి కిరణ్ కుమార్, బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, షేక్ మదీనా, కార్యదర్శి గద్దె బోయిన సతీష్, వాలంటీర్స్ అంబటి స్వామి, కోట మధు, అభి శెట్టి అభిలాష్, భీమా వెంకటేష్, మిరియాల అజయ్, అల్లంశెట్టి చందు, గురజాల గంగాధర్, మొదలగువారు పాల్గొన్నారు.