విద్యుత్ ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయమందించిన జనసేన

అత్రేయపురం మండలం లొల్ల గ్రామం చెందిన అడపా శ్రీను, గాజుల బాల సాయి మణికంఠ గణేష్ నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో గాయపడ్డారు. వారు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆత్రేయపురం మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజుతో కలిసి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించడం జరిగింది. గాయపడిన ఇరువురికీ వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 35000/- చొప్పున 70000/- రూపాయలు గ్రామ జనసేన పార్టీ తరుపున ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు బండారు శ్రీనివాస్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బొక్కా అదినారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు కల్లూరి పుత్ర సాయిరాం, పుల్లేటికుర్తి వీరభద్రం, ఆలమూరు మండల నాయకులు సలాది జేపీ, కొత్తపల్లి నగేష్, నాగిరెడ్డి మణికంఠ పాల్గొన్నారు.