జనసేన పార్టీతోనే నియోజకవర్గం మరియు రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: రమేష్ బాబు

దర్శి నియోజకవర్గం, దొనకొండ మండలం పెద్దనపాలెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన యాభై కుటుంబాలు జనసేనపార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి బొటుకు రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీ లో చేరడం జరిగింది. డిసెంబర్ నెల 26వ తేదీన స్వర్గీయ వంగవీటి మోహన రంగా ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమము అనంతరం గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలతో స్ఫూర్తి పొంది, ప్రస్తుత అధికార మరియు ప్రతిపక్ష పార్టీల విధానాలతో విసుగుచెంది, అధికారం లేకపోయినా ప్రజా సమస్యలమీద నిరంతరం నిజాయితీగా పోరాడుతున్న జనసేన పార్టీని రానున్న కాలంలో అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. వారికి జనసేన పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, చేరిన వారందరిని రమేష్ బాబు అభినందించారు.