జనసేన – టీడీపీ పార్టీల నియోజకవర్గ స్థాయి సమావేశం

తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే జనసేన-తెలుగు దేశం పార్టీల సంయుక్త భారీ బహిరంగ సభకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం ఎల్.ఎస్ ల్యాండ్ మార్క్ లో జనసేన టిడిపి పార్టీ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు అధ్యక్షతన జరిగిన జనసేన – టీడీపీ పార్టీల సంయుక్త సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, ఇరు పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల శాఖ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగుదేశం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.