తాడేపల్లిగూడెం బహిరంగ సభను విజయవంతం చేయండి!!

  • జనసేన – టీడీపీ ఉమ్మడి సభకు యుద్ధప్రాతిపదికన సమాయత్తం కావాలి
  • మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలకు విజ్ఞప్తి..

మదనపల్లి: జనసేన – టీడీపీ ఉమ్మడి సభకు యుద్ధప్రాతిపదికన సమాయత్తం కావాలని మదనపల్లి జనసేన నాయకులు శ్రీ రామ రామాంజనేయులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన చిన్న తిప్ప సముద్రం నల్లవీరగంగాభవాని అమ్మవారి జాతర సందర్భంగా మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు అలాగే జనసేన కుటుంబ సభ్యులకు అమ్మవారి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫిబ్రవరి 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే జనసేన టిడిపి ఉమ్మడి బహిరంగ సభకు మదనపల్లి జనసేన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా పేరుపేరునా తెలియజేస్తూ అలాగే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకి బర్మా వీధిలో ఉండే మదనపల్లి జనసేన ఆఫీస్ నుండి తాడేపల్లిగూడెం బహిరంగ సభకి వెహికల్స్ బయలుదేరును. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమానికి మదనపల్లి నుండి జనసేన కుటుంబ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని శ్రీ రామ రామాంజనేయులు తెలిపారు.