రాజంపేట జనసేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజంపేట నియోజకవర్గం: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లిలో అంబేద్కర్ వాది పల్లం నాగేంద్ర, సుండుపల్లి మొదటి మాజీ ఎంపీటీసీ నంద్యాల రామయ్య, జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, మండల నాయకులు రగురామకృష్ణంరాజు, బీసీ నాయకులు మంగిరి రమణయ్య, గంతల చెన్నకృష్ణ, వెంకటేష్ ఆచారి, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు నేతలతో కలిసి డా:బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం.. దాని ఫలాలను ఆస్వాదిద్దాం.. దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతగల పౌరులుగా మెలుగుదామంటూ నినాదాలతో దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.