ముమ్మిడివరంలో ఘనంగా రాజ్యాంగ రూపకర్త జయంతి వేడుకలు

ముమ్మిడివరం, డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ముమ్మిడివరం జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో 132 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం ముమ్మిడివరం కాశివానితూము సెంటర్, మరియు, పల్లిపాలెంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత‌గా దేశ గ‌మ‌నాన్ని మార్చ‌డంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్క‌ర్ పోషించిన‌ పాత్ర ఎనలేనిదని, ఆయన జీవితమే ఓ గొప్ప పాఠం అని ఆయన చెప్పిన మాటలు తరతరాలకు ఆదర్శం అని తెలిపారు. సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితోనే జనసేనపార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుద్దటి జమ్మి, తాళ్లూరి ప్రసాద్, గొలకోటి వెంకన్న బాబు, బల్ల కుమార్, గిడ్డి రత్నశ్రీ, కడలి కొండ,దూడల స్వామి, ఓగురి భాగ్యశ్రీ, సలాది రాజా, పాయసం సాయి, జగతా సతీష్,పితాని రాజు నాతి నాగేశ్వరరావు, పెన్నాడ శివ, వంగా సీతారాం, పిల్లి గోపి, విత్తనాల అర్జున్, బొంతు వీరబాబు, దేవు రాంబాబు పువ్వుల జయప్రకాష్, గంజా యేసు, గెద్దాడ పండు, కన్నీడి నాని, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, బొంతు సత్యనారాయణ, పెమ్మిరెడ్డి రామకోటేశ్వరరావు, ఓగూరి నూతన బాబు తదితరులు పాల్గొన్నారు.