జనసైనికులకు పరామర్శ

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం రూరల్ మండలం చిందాడగరువు గ్రామంలో ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న జనసైనికులను అమలాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పరామర్శించారు. చిందాడగరువు జనసైనికులు పొణకాల తాతాజీ, దాసరి నాగయ్య లను బుధవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిందాడ గరువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు, గ్రామకమిటీ అధ్యక్షులు పిల్లా రవి, ఏడిద పల్లంరాజు, మాజీ ఉప సర్పంచ్ కడలి సత్యనారాయణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.