మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి

గిరిజన JAC పిలుపు మేరకు కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికలపై…డిప్యూటీ సీఎం, గిరిజన శాఖా మంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అనుచరుడు అయినటువంటి రాంబాబు అనే వైసిపి కార్యకర్త చేసిన అత్యాచారానికి నిరసనగా జరిగిన ర్యాలీలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మరియు కురుపాం నియోజకవర్గ జనసేన నాయకులు వంశీ, గౌరీ శంకర్, శ్రీరామ్ మరియు ఉపేంద్ర, రాజేష్, ధర్మ సాలూరు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల గోవిందమ్మ, బొబ్బిలి నాయుకులు సంచాన గంగాధర్ మరియు పార్వతీపురం నియోజకవర్గ నాయకులు అల్లు రమేష్, మరియు మణి పాల్గొని ఆ దోషిని కఠినంగా శిక్షించి, బాధిత బాలికలకు తక్షణమే న్యాయం చెయ్యాలని, వారి చదువుకు కావలసిన మౌళిక సదుపాయాలు ప్రభుత్వమే భరించి, వారి చదువు అనంతరం, ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించేలా హామీపత్రం విడుదల చేయాలని జనసేన డిమాండ్ చేయడం జరిగింది.