కర్ణాటక ముఖ్య మంత్రి యడియూరప్పకి కరోనా పాజిటివ్

కరోనా రోజు రోజుకూ చేయిదాటిపోతూ పట్టపగ్గాలు లేకుండా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. కరోనా సామూహిక వ్యాప్తి దశలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. దీనిని ఆపడం ప్రభుత్వాల వల్ల కావడం లేదు. దేశంలో పెద్దపెద్ద వాళ్లందరికీ కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఇక ఇదే రోజు తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ కు కూడా కరోనా సోకింది. మరి ఇప్పుడు ఇంకొక కలకలం ఏంటి అంటే కర్ణాటక ముఖ్య మంత్రి బీఎస్. యడియూరప్ప కి కూడా కరోనా పాజిటివ్ అని తెలుస్తుంది. ఆయనని ఇప్పటికే హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా స్వయంగా ఆయనే ఈ విషయాన్నీ వెల్లడించారు.