త్వరలోనే తక్కువ ధరలోనే కరోనా వ్యాక్సిన్‌

శామీర్ పేట లోని భారత్ బయోటెక్ సంస్థను ఈ రోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ ధాని మోడి చెప్పినట్లు భారత్‌లోనే కరోనా వ్యాక్సిన్ తయారీకి అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో శ్రమిస్తున్న ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నాని తెలిపారు. శాస్త్రవేత్తలు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టారని తెలిపారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరిని నిర్మూలించడానికి శాస్త్రవేతలతో పాటు వ్యాక్సిన్ తయారీకి శ్రమిస్తున్న ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భారత్ బయోటెక్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.