శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారిని దర్శించిన కౌన్సిలర్ విజయలక్ష్మి వాసు దంపతులు

అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు భాగంగా అమలాపురం మెయిన్ రోడ్ లో గల పచ్చిగోళ్ళ జనార్ధన రావు కళ్యాణమండపంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాలు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులకు వివరిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా జరిగిన ప్రత్యేక పూజకార్యక్రమం లో అమలాపురం పురపాలకసంఘ 9వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయ లక్ష్మి-వాసు దంపతులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ జీయర్ స్వామి వారిని దర్శించుకుని తీర్ద ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారు కౌన్సిలర్ విజయలక్ష్మికి రవికలముక్క-వాసుకు ఖండువా కప్పి దంపతులను ఆశీ ర్వదించారు. అనంతరంశ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించు కున్నారు.కమిటీ వారికి ధన్యవాదములు తెలిపారు.