ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు…

మార్చి 10 వ తేదీన ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 71 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కార్పొరేషన్లలో 2204, మున్సిపాలిటీల్లో 1822 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 20,419 మంది పోలీసులతో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 70 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 8 గంటలలోగా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎస్ఈసి. కరెంట్ సమస్య లేకుండా ఉండేందుకు ముందస్తుగానే కౌంటింగ్ కేంద్రాల్లో జనరేటర్లను ఏర్పాటు చేసింది.