ఎకరాకు లక్ష రూపాయలు పంట నష్టం ఇవ్వాలి: డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, అకాల వర్షాలతో, గాలి వానలతో పిఠాపురం నియోజకవర్గంలో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిలిందని అరటిపంట రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు గాలి వానలు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో అరటిపంట సర్వ నాశనం అయింది అదేవిధంగా పలుచోట్ల వరి పంట నాశనమైనది పంట నష్టంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు, పిఠాపురం మండలం ఎఫ్ కే పాలెం గ్రామంలో గాలి వానతో అరటిపంట సర్వ నాశనం అయినది, నష్టపోయిన పంటను డాక్టర్ పిల్లా శ్రీధర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి యొక్క కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలతో గాలి వానలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు పంట నష్టం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.