మీ బిడ్డల భవిష్యత్తు కోసం జనసేనకు పట్టం కట్టండి: బత్తుల

ఒకేసారి రాజానగరం నియోజకవర్గంలో బత్తుల దంపతుల ఆధ్వర్యంలో రెండు చోట్ల రెండు గ్రామాల్లో విడివిడిగా పాదయాత్రలు జరుగుతున్న సందర్భంగా రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామంలో నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మీ, భూపాలపట్నం సర్పంచ్ గుళ్లింకల అన్నపూర్ణ, లోవరాజు ఆధ్వర్యంలో జరిగిన జనం కోసం జనసేన మహా పాదయాత్ర కు పెద్దఎత్తున గ్రామ ప్రజలు తరలివచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ, జనసేన పార్టీ విధి విధానాలు వివరిస్తూ, ఈసారి పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టాలని, భావితరాల భవిష్యత్తు కాపాడాలని అభ్యర్థిస్తూ జనసేన కరపత్రాలు పంచుతూ సాగిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. జనసేన నాయకులు గుల్లింకల లోవరాజు పాదయాత్ర సందర్భం గా గ్రామంలో ప్రత్యేక ఏర్పాటు చేసివచ్చిన వారందరికీ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుల్లింకల అన్నపుర్ణ లోవరాజు, మేడిం విష్ణు, పంతం శ్రీనివాస్, పంతం మంగ, సుంకర దొరబాబు, గండి రత్నాలరవు, మేడిం నాగేశ్వరావు, మేడిఒ వెంకట సూర్యనారాయణ, పంతం గంగరాజు, పామర్తి శ్రీను, తూముసతిబాబు, మేడిం శ్రీను, పంతం వెంకట రమణ, పంతం చంటి, గణేశులు సత్తిబాబు, అనీసెట్టి భిమేష్, రాయుడు శ్రీను, టపాస్ కుమార్, పంతం శ్రీను, మేడిఒ లక్ష్మణరావు, మేడిం దుర్గారావు, పంతం పెద్ద, తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.