శ్రీరామ రామాంజనేయులుని కలిసి మద్దతు తెలిపిన సిటిఎం గ్రామస్తులు, రైతులు

మదనపల్లి నియోజకవర్గం: సిటిఎం పంచాయతీ సిటిఎం గ్రామస్తులు, రైతులు, స్థానిక జనసేన నాయకుడు గంగాధర ఆధ్వర్యంలో బర్మా వీధిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి తమ మద్దతు జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థికి ముకుమ్మడిగా గ్రామస్తులు అందరూ మద్దతు తెలుపుతున్నట్టు స్థానిక జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులుని కలిసి మద్దతు తెలియజేశారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేనాని ఆశయాలు మెచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ఉమ్మడి అభివృద్ధిని గెలిపించుకుంటామని మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మద్దతు తెలియజేయడం శుభపరిణామం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దానికి ఇదే సంకేతం అని ఇలాగే అందరూ ముందుకు వచ్చి మద్దతు తెలపాలని రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలు సహకరించాలని తమ మద్దతు తెలియజేయాలని మద్దతు తెలియజేసిన శెట్టి రాజా, బాలాజీ, శెట్టి శీన, కోసూరు వేమన్న, నాగరాజు, రామచంద్ర మరియు సందీప్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.