ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ ఇవ్వాలి: రాజోలు జనసేన

రాజోలు, ఆక్వా రైతులకు కరెంటుపై సబ్సిడీ ఇచ్చి వారిని ఆదుకోవాలని జనసేన నాయకులు శనివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఆక్వా రైతులు కరెంటు చార్జీలు పెంచడంతో నష్టాలలో ఉన్నారని, కరెంట్ పై సబ్సిడీ ఇచ్చి వెంటనే వారిని ఆదుకోవాలంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజోలు ఎమ్మార్వో ముక్తేశ్వరరావుకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు మండల ఎంపీపీలు, మండల అధ్యక్షులు, సర్పంచులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.