కళ్యాణదుర్గంలో జనసేన ఆత్మీయ సమావేశం

అనంతపురం జిల్లా, జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వం మరియు మార్చ్ 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మీటింగ్ గురించి, జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శులు నాగేంద్ర, పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు కిరణ్, లక్ష్మీ నరసయ్య మరియు సంయుక్త కార్యదర్శి రాజేష్ మరియు నియోజకవర్గ కంబదూర్ మండల అధ్యక్షులు చంద్రమౌళి, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, బ్రమ్మ సముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు షేక్ మొహిద్దీన్, శెట్టూరు మండల అధ్యక్షులు లేపాక్షి ఈరన్న మరియు మండల కమిటీల సభ్యులు ముఖ్యంగా జనసైనికులు, వీరమహిళలు షేక్ తార, త్రివేణి, మమత, తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొనడం జరిగింది.