ఢిల్లీలో డేంజర్ బెల్స్.. కమ్మేసిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీని వాయువు కాలుష్యం ముంచెత్తింది. ఢిల్లీలో నిషేధం విధించినా ప్రజలు పటాకులు కాల్చడంతో వాయు కాలుష్యం అలముకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. నోయిడాలో అత్యధికంగా కాలుష్యం కమ్ముకుంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఏక్యూఐ526కు పెరిగింది. ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505 కు చేరింది.

ఏక్యూఐ 500 దాటిందంటే తీవ్రమైన కాలుష్యం ఏర్పడిందని తేలింది. పంజాబ్, హర్యానాలో పొలాల మంటల నుంచి వెలువడిన పొగ దేశ రాజధాని వైపు వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ, దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చడం కనిపించింది.

వ్యవసాయ పొలాల్లో మంటల నుంచి వెలువడిన పొగ వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది.ఢిల్లీ ఆకాశాన్ని పొగమంచు దట్టమైన దుప్పటి కప్పివేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల చాలా మంది ప్రజలు గొంతు, దురద,కళ్ల నుంచి నీరు కారుతున్నట్లు ఫిర్యాదులు చేశారు.