జగన్‌కు కాపులపై ఎందుకంత చిన్నచూపు- హరిరామ జోగయ్య

టీడీపీ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ప్రత్యేకించారు. దీన్ని పక్కనపెట్టే విధంగా మరో జీవోను వైసీపీ సర్కార్ ఇవ్వడం విచారకరం. జగన్‌ ప్రభుత్వం కాపుల పట్ల చిన్నచూపు చూడడం సరికాదు. ఈ జీవోను తక్షణమే సవరించాలి. కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ కొత్త జీవోను జారీ చేయాలి. ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలి.

2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకి మద్దతుగా నిలిచారు. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదని అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాను వినియోగించుకునే హక్కును రాష్ట్రాలకే కేంద్రం ఇచ్చింది. కాపు రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.