ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

ముమ్మిడివరం: జనసేన టీడీపీ, రాష్ట్ర అధ్యక్షులు పిలుపుమేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఇంచార్జ్ లు ఉమ్మడి సారథ్యంలో డిజిటల్ కేంపెయినింగ్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్య పరిచే కార్యక్రమం చేపట్టారు.
దీనిలో భాగంగా ముమ్మిడివరం – కాట్రేనికోన మండలాలను కలుపుతూ ఉన్న అయినాపురం మీదుగా వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉందని, తక్షణం ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ జనసేన టిడిపి, పార్టీలు నిరసన తెలియజేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేసి రెండేళ్లుగడిచినా పనులు చేయలేకపోవడం సిగ్గు, సిగ్గు సిగ్గంటూ స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సొంత గ్రామం అయినాపురం అయినప్పటికీ, బీసీ, ఎస్ సి, మత్స్యకార సోదరులు ఎక్కువగా నివసించే గ్రామాల్ని రోడ్లను పట్టించు కోలేదని అవి అద్వాన్నంగా ఉన్నాయని వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని జనసేన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, ముమ్మిడివరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ దాట్ల బుచ్చిబాబు, ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.