సంతపేటలో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన దాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం మున్సిపాలిటీ 17వ వార్డు సంతపేటలో సుమారు 34 సంవత్సరాల యువకుడు చాలా రోజులుగా సంతపేటలో ఉంటున్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఒక్కొ రోజు ఒక్కొక్కరు భోజనం పెడుతూ.. ఉండగా దినచర్య గడుపుతున్న ఆ యువకుడు ఆదివారం రాత్రి చనిపోవడం జరిగినది. సంతపేట నాగరాజు, సురేష్ మరియు జనసెనికుడు నగేష్ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి రాజుకు తెలియజేయగా వెంటనే స్థానిక ఎస్.ఐ కె గోవిందరావు కు సమాచారం అందించిన వెంటనే హెచ్ సి టి రామారావు వచ్చి పూర్తి సమాచారం తెలుసుకుని, దగ్గరుండి స్థానికుల సహాయంతో హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిపించడం జరిగినది. అందులో జనసేన పార్టీ పదో వార్డ్ ఇంచార్జ్ రోకళ్ల భాస్కరరావు మరియు నాగరాజు, గోపి, సురేష్, వెంకటరావు, నగేష్, భాస్కర్, ఆనంద్,వాలి, విక్కీ, ప్రసాద్, రసూల్, నాని పాల్గొన్నారు.