రైతుల సమస్యలపై ఎమ్మార్వో కు దాసరి రాజు వినతి పత్రం

ఇచ్చాపురం: రోడ్లపై ఉన్న రైతులు తమ సమస్యలపై జనసేన ఇంచార్జ్ దాసరి రాజును సంప్రదించగా.. ఈ మేరకు ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు కంచిలి మండలం తాసిల్దారుని కలవడం జరిగింది. ఎమ్మార్వో గారు స్పందించి నాలుగు మండలాల్లో ఉన్న మిల్లర్లు కు పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇవ్వలేదని ఎమ్మార్వో కు తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై దాసరి రాజు వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి 24 గంటల్లో రైతు సమస్యను పరిష్కరించవలసిందిగా ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేయడం జరిగింది. లేనియెడల రైతులతో జనసేన శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుందని జనసేన తరఫున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కంచిలీ జడ్పిటిసి అభ్యర్థి డాక్కరి ఈశ్వరరావు, మన్మధ దుంగు భాస్కరరావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.