నరేంద్రపురంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర 2వ రోజు
- జనసంద్రంలా మారిన నరేంద్రపురం గ్రామ రోడ్లు
- అడుగడుగునా హారతులు పడుతూ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజానీకం
రాజానగరం, రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామంలో శుక్రవారం రెండవ రోజు జనంకోసం జనసేన మహాపాదయాత్ర దృతంగా కొనసాగడం జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా అడుగడుగునా హారతులు ఇస్తూ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి పాలచర్ల గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలికడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ జనసేన పార్టీ సిద్దాంతాలు, ఆశయాలు ప్రతీ ఒక్కరికీ వివరిస్తూ రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న అవినీతి అరాచక పాలనను అంతమొందించి ప్రజా పరిపాలనకు అవకాశం ఇవ్వాలని రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి రాజానగరం నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడించాలని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ లను అందించిన నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో నరేంద్రపురం గ్రామ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-8.22.31-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-8.22.32-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-8.22.32-PM-1-1024x576.jpeg)