ప్రజాచైతన్య కార్యక్రమం 2వ రోజు

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో 31వ డివిజన్ ప్రాంతం వద్ద పార్టీ శ్రేణులు ప్రజాచైతన్య కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని వివరిస్తూ చైతన్యపరిచారు. ఈ ముఖ్యమంత్రి ఎపుడైనా బయటకి వచ్చి ఏదైన సభలో పాల్గొంటే మొదటగా సంభోదించేది నా అక్కచెల్లెమ్మలకు అని మొదలెట్టి చిక్కటి చిరునవ్వుతో అంటూ ఊదరగొడుతుంటే పాపం అమాయక ప్రజలు నిజమేకామోసు అని అనుకున్నారనీ తీరా అదే అక్కచెల్లెమ్మల పేరుతో వారినెత్తిన శఠగోపం పెట్టాడని తెలిసి అవాక్కవుతున్నారన్నారు. అద్భుత పధకాలు అని చెపుతు అవిస్తున్నాం, ఇవిచేస్తునాం అని అందమైన అబద్ధాలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతూ కాలాన్ని గడుపుతూ ఈ వై.సి.పి పార్టీవాళ్ళు తను చేసుకోవాలిసిన, చక్కబెట్టాలిసినవి చక్కబెట్టేసుకుంటున్నారనీ, తాజాగా అక్కచెల్లెమ్మలకు మినిడైరీలు అని అంటూ గేదెలను కొని ఇచ్చామంటూ కోట్లాది రూపాయల అవినీతి చేసారనీ ఇదొక పెద్ద స్కాం అని ప్రజలకు వివరించారు. ఓట్లకోసం వై.సి.పి పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ అవినీతిపై నిలదీయాలంటూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివ, జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, ముత్యాల దుర్గాప్రసాద్, వాసిరెడ్డి సతీష్, ద్వారపు సతీష్, దారపు శిరీష, జీవన్, సుంకర సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.