జనచైతన్య శంఖారావ కార్యక్రమం 22వ రోజు

రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం గ్రామం ఇండస్ట్రీయల్ కాలనీలో జనచైతన్య శంఖారావ కార్యక్రమం 22వ రోజు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ప్రారంభించడం జరిగింది. మొదటినుంచి చెప్పుకున్న విధంగానే ఈ ప్రాంతంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ డంపింగ్ యార్డ్ సమస్యల గురించి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా కుప్పలుగా పోసిన చెత్తకుప్పలు చూపించి వీటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఈ చెత్త కుప్పల వల్ల దోమలు, పందులు కూడా రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయని చెప్పడం జరిగింది. అందుకు దుర్గేష్ మాట్లాడుతూ నేను పంచాయతీ అధికారులతో మాట్లాడి మీ సమస్యలను తీరుస్తానని, రానున్న 6 లేక 7 నెలల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు మాట్లాడుకుంటున్నారని దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజ్జిన శివ, కొండమూరు వెంకటేష్, చిన్ని కృష్ణ, గంధం బాలు, కార్యదర్శి బీర ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి, దాము మట్టపర్తి నాగరాజు, దూది సాయి, మేక సత్యనారాయణ, జనసేన పార్టీ వేమగిరి గ్రామం ప్రెసిడెంట్ కొప్పిశేట్టి రాజేష్, వినోద్, సునీల్, ఐటీ శ్రీను, లోకేష్ ఎడ్ల వెంకటేష్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.