శేరిలింగంపల్లి జనసైనికుల ఆత్మీయ సమావేశం

శేరిలింగంపల్లి జనసైనికుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శేర్లింగంపల్లి కోఆర్డినేటర్ డాక్టర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సైనికులకు సూచించారు. రాబోయే రోజుల్లో శేలింగంపల్లిలో జనసేన సత్తా బలంగా వినిపించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్క జనసైనికుడు అనుదినం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రమేష్, శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, సందీప్, అశోక్, ప్రవీణ్, ఉపేంద్ర, నరేష్, నరసింహారెడ్డి, రాజు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.