జోరు వానలోనూ సాగిన జనంతో జనసేన

  • ఆమదాలవలస నియోజవర్గంలో జోరు వాన లోనూ జనంతో జనసేన కార్యక్రమం ( 7 వ రోజు)

ఆమదాలవలస నియోజకవర్గంలో, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్ (ఎంపీటీసీ) ఆధ్వర్యంలో, కొణిదల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 7 వ రోజు కొల్లివలస సంతలో ఉచితంగా టీ పంపిణీ కార్యక్రమం జరిగింది.. మరియు ప్రతి ఒక్క వ్యాపారస్తుల తో, సంతకి వచ్చిన కొనుగోలుదారులు అందరితో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని.. తొందర్లోనే ఆ సమస్యలు అన్నిటి పైన కూడా జనసేన తరుపున పోరాటం చేసి.. వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తామని భరోసా కల్పించడం జరిగింది. ఇలాంటి సమస్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే.. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని ఆదరించి, ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా మనవి చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట శ్రీను, సంతోష్ నాయుడు, ధూబా సంఘం నాయుడు, సెపెన రమేష్, కిళ్ళన నరేష్, వెంకటరమణ, ప్రసాద్, సత్యనారాయణ, లక్ష్మణరావు, నాని, దిలీప్, అనిల్, కోమలరావు, జనసేన కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకున్నారు.