ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రాజ శిఖామనికి చిరుసత్కారం

విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసి పదవీవిరమణ పొందిన అనంతరం 63 సంవత్సరాల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రముఖ సంఘసేవకులు, రాజశిఖామనిని మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అపార్టీ నాయకులు, ప్రజాగాయకులు ఆదాడ మోహనరావు సత్కరించారు.

ఈసందర్భంగా అదాడ మోహనరావు మాట్లాడుతూ విజయనగరంలో శిఖామని, పోలీస్ ట్రైనింగ్ కళాశాలో చేసిన సేవలు ఎనలేనివని, పి.టి.సి.కు ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చారని, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడగలమనే సిద్ధాంతాన్ని బాగా బలంగా యువతకు, ప్రజలకు ఎల్లప్పుడూ సందేశాన్ని ఇచ్చే శిఖామణి 63 సంవత్సరాల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం, ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ప్రముఖ శిఖరాలను ఈ వయస్సులో అధిరోహించాలనే ఆయన దృఢశంకల్పం ప్రస్తుత తరానికి, భావితరానికి ఆదర్శమని కొనియాడారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు), డాక్టర్ ఎస్.మురళీమోహన్, పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, రాజు పాల్గొన్నారు.