డీడీఎల్ రి-రిలీజ్

ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే… డీడీఎల్ ఈ చిత్రానికి బాలీవుడ్ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రేమకావ్యం బాలీవుడ్ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.

1995లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును కుదిపేసింది. నాలుగు కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం బారత సినిమా ప్రపంచలో 89 కోట్లు వసూలు చేసింది. విదేశాలలో 14 కోట్ల వరకు వసూలు చేసి అప్పట్లో పెద్ద రికార్డు కొట్టింది.

ఇక ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో బ్రేక్ అన్నది లేకుండా ఇరవై ఏళ్లకు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైందంటే దీనికి లభించిన ప్రేక్షకాదరణను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో ఈ చిత్రం దూసుకుపోయింది. షారుఖ్, కాజోల్‌ల స్టార్ డమ్ ను మరింత పెంచిన సినిమాగా దీనికి పేరుంది. తాజాగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 దేశాల్లో మళ్లీ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

జర్మనీ, యూఏఈ, సౌదీ అరేబియా, యూఎస్‌ఏ, యూకే, కెనడా, మారిషస్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిజి, నార్వే, స్వీడెన్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌ ఎస్టోనియా, ఫిన్లాండ్‌ దేశాల్లో విడుదల అవుతున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు.